Adivi Sesh: 'మేజర్' కూడా వాయిదానే!

Major movie update

  • 'మేజర్'గా అడివి శేష్
  • నిర్మాతగా మహేశ్ బాబు
  • ఫిబ్రవరి 11 నుంచి తప్పుకున్న సినిమా
  • త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన  

అడివి శేష్ కథానాయకుడిగా 'మేజర్' సినిమా రూపొందింది. సోనీ పిక్చర్స్ వారితో కలిసి మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్రగా నిర్మితమైంది. శోభిత ధూళిపాళ .. సయీ మంజ్రేకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే  ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాను అదే రోజున హిందీలోనూ విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.

మళ్లీ ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నామనేది త్వరలోనే చెబుతామని అన్నారు. ఇక ఇదే నెలలో థియేటర్లకు వెళదామనుకున్న 'ఆచార్య' కూడా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి నెలలో 'భీమ్లా నాయక్' .. ' ఖిలాడి' సినిమాలు మాత్రం విడుదలకి రెడీ అవుతున్నాయి. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి!

  • Loading...

More Telugu News