Santhosh Sobhan: 'శ్రీదేవి శోభన్ బాబు' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Sridevi Sobhan Babu movie lyrical song released

  • చిరంజీవి కూతురు నిర్మాతగా 'శ్రీదేవి శోభన్ బాబు'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • సంతోష్ శోభన్ జోడీగా గౌరీ 
  • సంగీత దర్శకుడిగా కమ్రన్

సంతోష్ శోభన్ హీరోగా 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా రూపొందింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల నిర్మించిన ఫస్టు మూవీ ఇది. ప్రశాంత్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో గౌరీ కిషన్ కథానాయికగా పరిచయమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది.

ఈ సినిమాకి కమ్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'నిను చూశాకా మతిపోయిందే .. మది నా మాటే విననంటుందే' అంటూ ఈ పాట సాగుతోంది. రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జునైద్ కుమార్ ఆలపించాడు.

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన పాట ఇది. ట్యూన్ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. అలాగే సాహిత్యపరమైన మెరుపులు కూడా లేవు. రొటీన్ గానే అనిపిస్తుంది. తెరపై కథ నడుస్తున్నప్పుడు .. ఈ పాట వచ్చే సందర్భం వలన ఆకట్టుకుంటుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News