Andhra Pradesh: మరోసారి నెల్లూరులో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ

MP Vemireddy Flexis Were Removed By Unidentified Persons In Nellore

  • ఎంపీ వేమిరెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు
  • ఆ ఫ్లెక్సీని చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీ తొలగింపు
  • ఘటనలపై వైసీపీ అధినేతకు ఫిర్యాదు?

ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ మరింత ముదురుతోంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీ తొలగించిన ఘటనలో ఘర్షణ సద్దుమణిగిందనుకుంటుండగానే.. మరో ఘటన జరిగింది. 

నిన్న రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మద్దతుదారులు నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ సర్కిల్ లో ఫ్లెక్సీ పెట్టారు. అయితే, వాటిని ఎవరో చించేయడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు. 

ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న విభేదాల వల్ల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే వాటిని తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. కాగా, ఫ్లెక్సీలను చించేసిన ఘటనలను వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News