Andhra Pradesh: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో నేడు వైఎస్ జగన్ భేటీ

AP CM Jagan will meet AP Hight Court Chief Justice Prashanth Kumar today

  • తొలిసారి భేటీ కానున్న జగన్-జస్టిస్ ప్రశాంత్ కుమార్
  • సాయత్రం 6.30 గంటలకు ప్రభుత్వ అతిథిగృహంలో భేటీ
  • రాజకీయంగానూ మొదలైన చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. జగన్-జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇప్పటికే పలు సందర్భాల్లో కలుసుకున్నా ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి భేటీపై రాజకీయంగానూ చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News