Sarkaru Vaari Paata: ఓటీటీలోకి వచ్చేసిన 'సర్కారువారి పాట'

Sarkaru Vaari Paata released in OTT in Amazon Prime

  • ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'సర్కారువారి పాట'
  • రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రం
  • ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో విడుదల

మహేశ్ బాబు, కీర్తీ సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ చిత్రంలో సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 

ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. రూ. 199 చెల్లించి ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ చందాదారులు సైతం డబ్బులు చెల్లించి చూడాలి.

  • Loading...

More Telugu News