Mahesh Babu: తొలి షెడ్యూలును పూర్తి చేసుకున్న మహేశ్ బాబు కొత్త చిత్రం

Mahesh Babu new movie first schedule completed

  • ఇటీవల మహేశ్ బాబు 28వ చిత్రం ప్రారంభం
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం
  • దసరా తర్వాత రెండో షెడ్యూల్
  • మహేశ్ బాబు, పూజా హెగ్డేలపై చిత్రీకరణ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న కొత్త చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీ ట్విన్స్ 'అన్బరివ్' (అన్బుమణి-అరివుమణి) ద్వయం పర్యవేక్షణలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు కూడా పాల్గొన్నారు. కాగా, రెండో షెడ్యూల్ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు హీరోయిన్ పూజా హెగ్డేపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ వెల్లడిస్తానని తెలిపారు. 

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వాత ఈ కాంబోలో ఓ చిత్రం సెట్స్ మీదకు వచ్చింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు లుక్ కొత్తగా ఉండడం అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News