Team India: ఢిల్లీ టెస్టులో 200 దాటిన టీమిండియా స్కోరు

Team India fight continues in Delhi test

  • ఆసక్తికరంగా రెండో టెస్టు
  • 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్
  • ఆదుకున్న అక్షర్ పటేల్, అశ్విన్

స్పిన్నర్లకు స్వర్గధామంలా మారిన ఢిల్లీ పిచ్ పై టీమిండియా పోరాడుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేయగా.... రెండో రోజు ఆటలో టీ విరామానంతరం సెషన్ లో టీమిండియా 7 వికెట్లకు 230 పరుగులతో ఆడుతోంది. 

ఓ దశలో 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ భారత్ స్కోరును 200 దాటించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 33 పరుగులు వెనుకబడి ఉంది. అక్షర్ పటేల్ 51, అశ్విన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ 5 వికెట్లు తీయడం విశేషం.

  • Loading...

More Telugu News