anasuya: నాలోని తల్లిని టార్గెట్ చేశావు కదా... ఆ తల్లి ఎంత ధైర్యవంతురాలో నీకు చూపిస్తా: అనసూయ

Anasuya comments on actor fan

  • ఇతరుల నుండి సానుభూతి కోసం ఏడ్వడం తనకు నచ్చదన్న అనసూయ
  • నువ్వు ఎవరో నీకు తెలుసు... తప్పు తెలుసుకునే వరకు ఇలాగే చేస్తానని వ్యాఖ్య
  • వీటన్నింటికి అర్థం చెప్పే ఒకరోజు వస్తుందని నమ్ముతానని వ్యాఖ్య

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ టాలీవుడ్ హీరో ఒకరు తన పేరు ముందు the అని పెట్టుకోవడాన్ని తప్పుబట్టారు. దీంతో సదరు నటుడి అభిమానులకు, ఈమెకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఈ సమయంలో ఆమె ఇన్ స్టాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇతరుల నుండి సానుభూతి పొందడం కోసం ఏడ్వడం తనకు నచ్చదని చెప్పారు. ఆమె ఇన్ స్టాలో కింది విధంగా పోస్ట్ చేశారు.

నువ్వు ఎవరో నీకు తెలుసు, నీ తప్పు నువ్వు తెలుసుకునే వరకు ఇలాగే చేస్తా, నా విషయంలో ఏదైతే చేశావో దానిని నువ్వు మర్చిపోకుండా గుర్తు చేస్తూనే ఉంటా... అని పేర్కొన్నారు. 

ఇలా చేయడం వల్ల తనపై నెగిటివిటీ రావొచ్చునని, అయినా నిజం, మంచితనం, భగవంతుడిపై తనకు నమ్మకం ఉందని, వాటి నుండే తాను మరింత శక్తి పొందుతున్నానని చెప్పారు. ఏడ్చి గగ్గోలు పెట్టి సానుభూతి పొందే పిరికిదాన్ని కాదని, దానికి తాను వ్యతిరేకినని, తనను ఎంత కిందకు లాగినా, తనపై బురద జల్లినా ఇలాగే ఫైట్ చేస్తానని చెప్పారు.

ఎందుకంటే వీటన్నింటికి అర్థం చెప్పే ఒకరోజు వస్తుందని నమ్ముతానని, పని లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నట్లు అనుకోకండని, ఇది కూడా తన బాధ్యతేనని అన్నారు. నువ్వు నాలోని తల్లిని టార్గెట్ చేశావు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లి ఎంత ధైర్యవంతురాలో నీకు చూపిస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News