Tirumala: తిరుమలలో నేడు కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ

Devotees rush continue on Monday in Tirumala

  • స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 
  • వెలుపలికి వచ్చిన క్యూ లైన్లు
  • నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.4.69 కోట్ల ఆదాయం

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది. నిన్న క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. 

నిన్న ఆదివారం తిరుమల వెంకన్నను 88,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,231 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే సమయంలో శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.69 కోట్ల ఆదాయం లభించింది.

  • Loading...

More Telugu News