Ambati Rambabu: పవన్ ద్రోహం చేశారని రేణుదేశాయే స్వయంగా చెప్పారు: అంబటి రాంబాబు

ambati rambabu fires on chandrababu and pawan

  • పవన్ వారాహి ఎక్కి పిచ్చి కూతలు కూస్తున్నారన్న అంబటి రాంబాబు
  • ప్రభుత్వంపై శృతి మించి విమర్శలు చేస్తున్నారని మండిపాటు
  • చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ తాపత్రయమని ఎద్దేవా
  • ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా? అని ప్రశ్న

తమ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ శృతి మించి విమర్శలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వారాహి ఎక్కి పిచ్చి కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ తాపత్రయమని అన్నారు. 

ఆదివారం మీడియాతో అంబటి మాట్లాడుతూ.. వాలంటీర్లపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియానే దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకుందామని ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. 

పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే ఆయన పని చేస్తున్నారని, జనసేన కార్యకర్తలను ముంచేస్తారని హెచ్చరించారు. విశాఖపై పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, నిబంధనల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. 

పవన్ ద్రోహం చేశారని రేణుదేశాయే స్వయంగా చెప్పారని అంబటి అన్నారు. భర్త ఎలాంటి వాడైనా భార్య సపోర్టు చేయడం సాధారణమని అన్నారు. భార్యకే ద్రోహం చేసిన వ్యక్తి.. ఇక రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News