Jogi Ramesh: జోగి రమేశ్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి

stones pelted on Jogi ramesh house in ntr district

  • ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం మధ్యాహ్నం ఘటన
  • కారులో వచ్చి రాళ్లు రువ్విన గుర్తు తెలియని యువకులు
  • పోలీసులు అడ్డుకోవడంతో పారిపోయిన నిందితులు
  • యువకులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న ఇబ్రహీంపట్నం సీఐ

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఫెర్రీ నుంచి రింగుకూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే, ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులూ రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే, జోగి రమేశ్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News