Stree 2: 'స్త్రీ' రికార్డును బద్దలు కొట్టిన 'స్త్రీ-2'

The advance booking of the Rajkummar Rao and Shraddha Kapoor sequel breaks the record

  • శ్రద్ధా కపూర్‌, రాజ్‌కుమార్ రావు జంట‌గా  'స్త్రీ- 2'
  • 'స్త్రీ-2' కు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రూ. 6.87కోట్లు 
  • 2018లో 'స్త్రీ' మూవీకి తొలిరోజు రూ. 6.8 కోట్ల వ‌సూళ్లు 
  • ఆగస్టు 15న విడుదల కానున్న స్త్రీ-2 చిత్రం

ఈ ఇండిపెండెన్స్ డేకు బాలీవుడ్‌లో మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. శ్ర‌ద్ధా క‌పూర్‌, రాజ్‌కుమార్ రావు జంటగా న‌టించిన 'స్త్రీ-2', జాన్ అబ్రహం 'వేదా', అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే'. అయితే, అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం 'స్త్రీ-2' దూసుకెళుతోంది. ఈ రేసులో మిగిలిన రెండు చిత్రాల‌ను పూర్తిగా వెన‌క్కి నెట్టేసింది.

ఇప్పుడు ఈ సినిమా తనదైన బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది. ఒరిజినల్ 'స్త్రీ'మూవీ 2018లో విడుదలైంది. ఆ సినిమా మొద‌టి రోజు రూ. 6.82 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. అలాగే మొత్తం ర‌న్ టైమ్‌లో దాదాపు రూ. 130 కోట్లు రాబట్టింది. అయితే, 'స్త్రీ-2' అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 2.21ల‌క్ష‌ల టికెట్లు అమ్ముడుపోగా, రూ. 6.87కోట్లు వ‌చ్చిన‌ట్లు 'సక్‌నిల్క్' తెలిపింది. దీంతో 'స్త్రీ' తొలి రోజు వసూళ్ల రికార్డును 'స్త్రీ-2' కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే బద్దలు కొట్టిన‌ట్లైంది. 

ఇక చిత్రం విడుదలకు మరో 2 రోజులు ఉన్నందున‌ ఇది సులభంగా 10 కోట్ల రూపాయలను దాటుతుందని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కాగా, మహారాష్ట్ర, ఢిల్లీల‌లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ మూవీ వరుసగా రూ. 1.87 కోట్లు, రూ. 1.83 కోట్లు వసూలు చేయ‌డం విశేషం. 

అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ, హారర్ జానర్ లో తెరకెక్కింది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. దాంతో మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

  • Loading...

More Telugu News