Manchu Vishnu: మంచు విష్ణు కార్యాలయాల్లో ముగిసిన జీఎస్టీ అధికారుల సోదాలు ..కన్నప్ప మూవీ రికార్డులు స్వాధీనం

- మంచు విష్ణు కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ అధికారుల సోదాలు
- కన్నప్ప మూవీ రికార్డులు స్వాధీనం
- పన్ను ఎగవేత జరిగినట్లు ప్రాధమికంగా గుర్తింపు
నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్లో ఉన్న ఆయన కార్యాలయాలలో ఏకకాలంలో రెండు ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.
కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. సోదాలు జరుగుతున్న సమయంలో మంచు మోహన్ బాబు విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో మంచు విష్ణు తిన్నడు/కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.
కాగా, ఈ చిత్రం శుక్రవారం (27వ తేదీ) విడుదల కానుండగా, బుధవారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వెళ్లడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. సోదాలు జరుగుతున్న సమయంలో మంచు మోహన్ బాబు విష్ణు కార్యాలయానికి చేరుకున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో మంచు విష్ణు తిన్నడు/కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.
కాగా, ఈ చిత్రం శుక్రవారం (27వ తేదీ) విడుదల కానుండగా, బుధవారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వెళ్లడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.