సరయు నదిలో అత్త అంత్యక్రియలు.. అల్లుడిని లాక్కెళ్లిన మొసలి

Crocodile attack in Sarayu River Man missing after funeral
  • నదిలో స్నానం చేస్తుండగా వ్యక్తిపై మొసలి దాడి
  • అత్త అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన గ్రేటర్ నోయిడా వాసి
  • హెచ్చరికలను పట్టించుకోకుండా నదిలోకి దిగడంతో ఘటన
  • గల్లంతైన యువకుడి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తగారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై మొసలి దాడి చేసి, నదిలోకి లాక్కెళ్లింది. సరయూ నదిలో బుధవారం జరిగిన ఈ ఘటనలో గల్లంతైన యువకుడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.

గ్రేటర్ నోయిడాకు చెందిన 30 ఏళ్ల దీపక్ శర్మ తన అత్త ఉర్మిళా దేవి మరణించడంతో గోండా జిల్లాలోని ఉమ్రి గ్రామానికి వచ్చారు. నదీ తీరంలో అంత్యక్రియల కోసం చితి గుంత తవ్వడంలో సహాయం చేసిన తర్వాత స్నానం చేసేందుకు సరయూ నదిలోకి దిగాడు. ఆ సమయంలో నీటిలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఓ భారీ మొసలి దీపక్ తలను నోట కరుచుకుని క్షణాల్లో నీటిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడివారు షాక్‌కు గురయ్యారు.

నదిలోకి వెళ్లవద్దని అంత్యక్రియలకు వచ్చిన వారు దీపక్‌ను హెచ్చరించినా అతడు ఆ మాటలు పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు, పడవ నడిపేవారు గాలింపు మొదలుపెట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా రంగంలోకి దిగి గాలించినా ఫలితం లేకపోయింది.
దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసేందుకు లక్నో నుంచి రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలను రప్పించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నప్పటికీ, దీపక్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
Go Back to Shorts
Deepak Sharma
Sarayu River
Uttar Pradesh
Crocodile attack
Funeral
Gonda district
Umri village
SDRF
River Search Operation

More Telugu News