Ram Charan: ఓటు వేసేందుకు మైసూరు నుంచి హైదరాబాద్ బయల్దేరిన రామ్ చరణ్

 Ram Charan fly to Hyderabad from Mysore to cast his vote tomorrow

  • రేపు తెలంగాణలో ఎన్నికలు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న రామ్ చరణ్
  • ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న గ్లోబల్ స్టార్
  • మైసూరులో షూటింగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపటి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు (నవంబరు 30) జరగనుండగా, ఓ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చడం పట్ల రామ్ చరణ్ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఓటు వేయడం కోసం ఆయన మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా ప్రజాస్వామ్యం, ఎన్నికల చుట్టూనే తిరుగుతుంది. 'గేమ్ చేంజర్' తాజా షెడ్యూల్ చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. 

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News