CM Brother: హైడ్రా నోటీసులపై సీఎం సోదరుడు ఏమన్నారంటే..?

CM Revanth Reddy Brother Tirupathi Reddy Reaction On HYDRA Notices
--
దుర్గం చెరువును ఆనుకుని కట్టిన కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న వారిలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు. అమర్ సొసైటీలోని తిరుపతి రెడ్డి నివాసానికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. దీనిపై తాజాగా తిరుపతి రెడ్డి స్పందించారు.

2015లో అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ ఇల్లు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని వివరించారు. తాజాగా నోటీసులు అందుకున్న తర్వాతే తనకు విషయం తెలిసిందని చెప్పుకొచ్చారు. ఫుల్ టాంక్ లెవెల్ లో ఉన్న మిగతా నిర్మాణాల విషయంలో వ్యవహరించిన మాదిరిగానే తన నివాసంపైనా అధికారులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
CM Brother
Tirupati Reddy
HYDRA
Amar society
Durgam Cheruvu

More Telugu News