మిస్టరీ ఎంటర్‌టైనర్‌ 'గ్యాంబ్లర్స్‌' టీజర్ విడుదల

సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'గ్యాంబ్లర్స్‌'. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.  నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు  ఈ సినిమాను రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్ ను సోమవారం విడుదల చేశారు మేకర్స్‌. 

టీజర్‌ను గమనిస్తే '' యుద్దం జూదం ఒక్కటే.. యుద్దం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి' అంటూ ఓ సంభాషణతో మొదలవుతుంది. ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌ ఓ గ్యాంబ్లర్‌గా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాలోని ముఖ్య పాత్రలను ఈ టీజర్‌లో పరిచయం చేశారు. టీజర్‌ను చూస్తుంటే సినిమా చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. వైవిధ్యమైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ టీజర్‌ అందరిలోనూ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. 


ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో కొత్త సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల కేసీఆర్‌ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్‌ రాకేష్‌ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంది|  అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ '' మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో సంగీత్‌ శోభన్‌కు యూత్‌లు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఆయన ఇందులో  చేస్తున్నారు. కొత్తకాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్‌ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. 





More Press Releases