తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు
- తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ
- శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం
- బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూలైన్లు
- నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు
- నిన్న శనివారం 97 వేల మందికి పైగా స్వామివారి దర్శనం
వేసవి సెలవులు, వారాంతం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. రద్దీ తీవ్రతకు అనుగుణంగా టీటీడీ అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్నవారికి తాగునీరు, అల్పాహారం వంటివి అందిస్తున్నారు.
టీటీడీ గణాంకాల ప్రకారం, నిన్న మే 23వ తేదీ శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 97,561 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 57,780 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజున శ్రీవారి హుండీకి రూ. 3.76 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.